కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి నవ్వుల పాలయ్యారు. బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని ఇరుకున పెట్టాలనుకుంటున్న రాహుల్ గాంధీ తానే చిక్కుల్లో పడుతున్నారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ పొరపాటును మహిళల వాష్ రూంలోకి వెెళ్లాడు.గుజరాత్ ోలని ఉదయ్ పూర్ జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ అక్కడ వాష్ రూంకోసం వెళ్లారు. అయితే మహిళల వాష్ రూంలోకి రాహుల్ వెల్లడంతో అక్కడి వారు ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. అయితే వాష్ రూం బయట కేవలం గుజరాతీ భాషలో మాత్రమే బోర్డు ఉంది. ఇంగ్లీషులో కానీ హిందీలో కానీ బోర్డులు లేకపోవడంతో రాహుల్ గాంధీ పొరపాటును మహిళల వాష్ రూంలోకి వెళ్లారని అంటున్నారు.
ఈ వ్యవహారంపై రాహుల్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇది చాలా చిన్న విషయమని అన్నారు. వాష్ రూం బయట బోర్డులు లేకపోవడంతో రాహుల్ పొరపడ్డారని ఇందులో పెద్ద విషయం ఏమీ లేదని వారు చెప్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానికి విలేకర్లు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.