రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను తీసుకుని వెళ్లిన పీఎస్ఎల్పీ ప్రయోగం తొలిదశ విజయవంతం అయింది. పీఎస్ఎల్వి-సీ37 104 ఉపగ్రహాలను తీసుకుని నింగిలోకి దూసుకుని పోయింది. ప్రపంచంలోని ఏ దేశమూ చేయని సాహసం చేసిన ఇస్రో 104 ఉపగ్రహాలను ఓకేసారి కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగంతో భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే ఇది ఒక మైలు రాయిగా నిల్చిపోనుంది. దీనితో భారత అంతరిక్ష కీర్తి పతాక అంతరిక్ష ప్రపంచంలో రెపరెపలాడుతోంది. ప్రస్తుతం ప్రయోగించిన 104 ఉపగ్రహాల్లో మూడు మాత్రమే భారత్ కు చెందినవి కాగా 101 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి.
- సూర్యావర్తన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది.
- 28.42 నిమిషాల్లో రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది.
- ప్రయోగం ప్రారంభమైన తర్వాత 17.29 నిమిషాలకు కార్టోశాట్-2.. రాకెట్ నుంచి 510.383 కిలోమీటర్ల ఎత్తులో విడిపోయింది.
- ఐఎన్ఎస్-1ఏ 17.29 నిమిషాలకు, ఐఎన్ఎస్-1బి 17.40 నిమిషాలకు వాహక నౌక నుంచి విడిపోయాయి.
- దీని తర్వాత 18.32 నిమిషాల నుంచి 28.42 నిమిషాల మధ్య విదేశీ ఉపగ్రహాలన్నీ 524 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ నుంచి విడిపోయేలా ఇస్రో శాస్త్రవేత్తలు వాహక నౌకను సిద్ధం చేశారు.