మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా సాటింది.ముంబై థానేలు మినహా మిగిలిన అన్ని చోట్లా బీజేపీవిజయం సాధించారు. పుణె, ఉల్లాస్నగర్, పింప్రి-ఛించ్వాడ్, నాగ్పూర్, నాసిక్, షోలాపూర్, అకోలా, అమరావతి కార్పొరేషన్లను బీజేపీ సొంతం చేసుకుంది.
దేశంలోని అత్యంత ధనిక కార్పోరేషన్ గా పేరుగాంచిన ముంబై కార్పోపేషన్ లో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. హోరా హోరీగా సాగిన పోరులో ఇక్కడ శివసేన 84 డివిజన్లను కైవసం చేసుకుంది. బీజేపీకి 81 డివిజన్లు దక్కాయి. కాంగ్రెస్ 31 చోట్ల గెలిచింది.
ఇక థానెలో శివసేన హవా కనిపించింది. ఇక్కడ శివసేనకు 42, బీజేపీకి 14, ఎన్సీపీకి 16, కాంగ్రెస్కు 1 చొప్పున డివిజన్లలో విజయం లభించింది.
పుణెలో బీజేపీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక్కడ 74 డివజిన్లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేశారు. శివసేన కేవలం 8 చోట్ల మాత్రమే గెలిచింది. కాంగ్రెస్కు 2, ఎన్సీపీకి 34 స్థానాలు వచ్చాయి.
ఉల్లాస్నగర్లో నూ బీజేపీ శివసేనలు హోరా హోరీగా పోటీ పడ్డాయి. బీజేపీకి 34, శివసేనకు 25 స్థానాలు దక్కాయి.
పింప్రి-ఛించ్వాడ్లో బీజేపీకి 30, శివసేన 5 స్థానాల్లో గెలిచాయి.
మహారాష్ట్రాలోని మరో ప్రముఖ నగరం నాగ్పూర్లో బీజేపీకి 70 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ 30 చోట్ల గెలిచాయి.
నాసిక్లో బీజేపీ 33, శివసేన 20 చోట్ల విజయం సాధించాయి.
షోలాపూర్లో బీజేపీకి 39, శివసేనకు 14, కాంగ్రెస్కు 11 డివిజన్లు దక్కాయి.
అకోలాలో బీజేపీకి 31, కాంగ్రెస్కు 12 వచ్చాయి.
అమరావతిలో బీజేపీ 24 స్థానాలు గెలవగా, కాంగ్రెస్ 8 చోట్ల గెలిచింది.
మరో వైపు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త మెరుగైన ఫలితాలను సాధించింది. పట్టణ ప్రాంతాల్లో ఘోరంగా విఫలమైనా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పరువు నిలుపుకుంది. కాంగ్రెస్ పార్టీ మొత్తం 343 జడ్పీ స్థానాలను గెలుచుకోగా, శివసేనకు 237 వచ్చాయి. కాంగ్రెస్ 253 చోట్ల, ఎన్సీపీ 314 చోట్ల గెలిచాయి. దాంతో ఎక్కువ జిల్లా పరిషత్తులను కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.