అక్కడా రు.500 నోట్లను తీసుకోరు….
పాత ఐదు వందల రూపాయల నోటు చాలామణి గురువారం రాత్రి నుండి పూర్తిగా నిల్చిపోనుంది. గురువారం రాత్రి తరువాత ఈ నోట్లను కేవలం బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పరిమిత లావాదేవీల్లో 500 నోట్లను అనుమతిస్తూ వచ్చారు. వాటిని కూడా గురువారం రాత్రి నుండి అనుమతించరు.
- విద్యుత్, నీటి బిల్లులు చెల్లింపులు కూడా 500 రూపాయల నోట్లతో చేసే అవకాశం లేదు.
- మందుల షాపుల్లోనూ గురువారం రాత్రి నుండి 500 రూపాయల నోట్లు తీసుకోరు.
- పొడిగింపుకు సుముఖంగా లేని కేంద్ర ప్రభుత్వం
- పొట్రోలు బంకులతో సహా మిగతా అన్ని చోట్లా ఇప్పటికే పాత నోట్లను తీసుకోవడం ఆపేశారు.
- బ్యాంకుల్లో మాత్రం పాత నోట్లను డిపాజిట్ చేయవచ్చు.
- పాత నోట్లను డిపాజిట్ చేయడానికి డిసెంబర్ 30 వరకు గడువు